మంచిర్యాలటౌన్/సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 3: మంచిర్యాల గోదావరి తీరం, సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ఆదేశించారు. శనివారం ఆయన రెండు చోట్ల ఏర్పాట్లను పరిశీలించారు. జాతరలో ముఖ్యంగా పారిశుధ్యం, ట్రాఫిక్ సమస్యలు, తాగునీరు, వీధిదీపాలు, లైటింగ్, స్నానఘట్టాలు, ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. సీసీసీలో సింగరేణి అధికారులతో మాట్లాడారు. సింగరేణి అధికారులు రఘుకుమార్, అరవిందరావు, కాంతారావు, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ సతీశ్, పూజారి సాతూరి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని రైల్వే ఓవర్బ్రిడ్జిపై రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప నులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, ఏఈ రాజేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్రాథోడ్, ఎస్ఐ రాజేందర్, విద్యుత్ శాఖ ఏడీఈ రేగుంట స్వామి ఉన్నారు.
మంచిర్యాలకు చెందిన బొద్దుల శ్రీనివాస్ ఇ టీవలే ప్రమాదంలో మృతిచెందాడు. గాయ త్రి బ్యాంకులో సేవింగ్స్ ఖాతాదారుడు కావడంతో, ఆయన భార్య శిరీషకు రూ.లక్ష ప్ర మాద బీమా చెక్కును ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అందజేశారు. బ్రాంచ్ ఇన్చార్జి ప్రవీణ్, కౌన్సిలర్ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.