కౌటాల, డిసెంబర్ 2 : సీఎం కేసీఆర్ కరుణామయుడు అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలకేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌటాల, చింతలమానేపల్లి మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ చరిత్రలో లేని అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఇటీవలే ఆయా రాష్ర్టాల రైతులు వచ్చి ఇక్కడి వ్యవసాయ పథకాలపై సర్వే చేసినట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా రైతులకు ఉచిత కరెం ట్, పెట్టుబడి, రైతుబీమాతో వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని, అలాగే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న రాష్ట్రం మనదే అని అన్నారు.
ఇప్పటి వరకు కౌటాలలో 73, చిం తలమానేపల్లిలో 105 మంది రైతులు చనిపోతే వారి కుటుంబానికి వారంలోగా రూ. 5 లక్షల బీమా అందించిన ఘనత మనదే అన్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య ఉందని, పరిష్కారానికి రూ. 56 కోట్లతో 132/33 కేవీ సబ్స్టేషన్ మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గూడెం బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంత భూముల ధరలు పెరిగాయని, త్వరలోనే గుండాయిపేట వద్ద పెన్గంగపై త్వరలో బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు, దీంతో ఈ ప్రాంత భూములకు రెక్కలు వస్తాయన్నారు. ఉచిత టెట్, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ఇవ్వగా 69 2 మంది టెట్, 183 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆర్హత సాధించినట్లు పేర్కొన్నారు. నవంబర్ నుంచి ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు మార్చి వరకు అందించనున్నట్లు తెలిపారు. తన ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం నిత్యం సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. .
మండలంలోని కుంబారి, పార్డీ గ్రామాలకు ఐటీడీఏ నిధుల ద్వారా బీటీ రోడ్డు పనులకు శుక్రవా రం ఆయన భూమి పూజ చేశారు. త్వరలోనే పను లు ప్రారంభం అవుతాయని, అదేవిధంగా కౌటా ల నుంచి తుమ్డిహట్టి, కౌటాల నుంచి గుడ్లబోరి, కౌటాల నుంచి తలోడి వరకు రోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
కౌటాల మండలంలోని బోదంపల్లి, చింతలమానేపల్లి మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన 50 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే కోనప్ప సమక్షంలో పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కోనప్ప చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు బసార్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, టీఆర్ఎస్ అధ్యక్షులు వసం త్ రావు, డుబ్బుల వెంకన్న, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు శైలజ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బ్రహ్మయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సదాశివ్, జేఈ బద్రొద్దీన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మారుతి, కో ఆప్షన్ సభ్యులు అజ్మత్ అలీ, నాజీం హుస్సేన్, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్ గౌడ్, గంగారాం, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు నక్క శంకర్, మధుకర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, దాదాపు 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.