దండేపల్లి, జనవరి6 : గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకంతో కడెం ఆయకట్టు చివరి భూములన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం తానిమడుగు సమీపంలో డెలివరీ పాయింట్ వద్ద మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి పూజలు చేసి నీటిని విడుదల చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంతో రైతులకు సాగునీటి కష్టాలు తీరిపోయాయన్నారు. డీ-30 నుంచి 42 కాలువ వరకు ఎత్తిపోతల పథకం నీటిని అందిస్తామని తెలిపారు. రైతులు సాధ్యమైనంత వరకూ ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జడ్పీటీసీ గడ్డం నాగారాణి-త్రిమూర్తి, డీఈఈలు దశరథ్, వెంకటేశ్వర్, జేఈలు జాకీర్, శ్రీధర్,సంజీవ్, రాజేందర్, సర్పంచ్ ప్రేమళ, రైతులు పాల్గొన్నారు.