తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తున్నదని, కేంద్రంలో బీజేపీ సర్కారు కూడా ఉన్నదని, కమలనాథులు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సవాల్ విసిరారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 12 వార్డుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. గులాబీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని కోరారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ప్రజలకు ఏం చేస్తున్నదో చెప్పాలని సూచించారు. – ఎదులాపురం, మే 23
ఎదులాపురం, మే 23 : తొమ్మిదేండ్ల కాలంలో పేదల కోసం రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన పనులు, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న సవాల్ విసిరారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టణంలోని 12 వార్డుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేశారన్నారు. కానీ.. బీజీపీ ఇచ్చిన వాగ్ధానాలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రం, కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రంథాలయ చైర్మన్ మనోహర్, పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, కౌన్సిలర్లు అర్చన, సంగీత, వెంకన్న, పవన్నాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.