ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 1 : మైనార్టీల సంక్షే మానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద వద్ద మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యం లో మైనార్టీ రెసిడె న్షియల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విద్యార్థులు, మైనార్టీ నాయకుల తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలను ముస్లింలు విరమిం చారు. ఎమ్మెల్యే జోగు రామన్న పలువురికి ఖర్జూరాలను తినిపించారు.
అనం తరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ కార్యదర్శి ఆశ్రాఫ్, మైనార్టీ అధ్యక్షుడు సలీం పాషా, కో ఆప్షన్ సభ్యులు ఏజాజ్, అసిఫ్, నాయకులు జహురొద్దీన్, సాజిదొద్దీన్, అబుజర్, సలీమోద్దీన్ అబ్రార్, స్థానికులు పాల్గొన్నారు.