ఎదులాపురం, మార్చి 26: రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ప్రతి పైసా మన రాష్ర్టానిదేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్లో రూ.55 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. అనంతరం 366 మందికి ఆసరా పింఛన్ కార్డులను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడు తూ.. ప్రభుత్వ పథకాల్లో తమ వాటా ఉందని బీజేపీ నాయకులు అంటున్నారని, అది నిరూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పింఛన్ పెరిగిందని పునరుద్ఘాటించారు. ప్రజలు అడగకముందే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిష న్ కిట్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖాల రూపురేఖ లు మారిపోయాయని స్పష్టం చేశారు.
పేద విద్యార్థులకు కూడా కా ర్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్నదని చెప్పా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. వంటగ్యాస్, నిత్యవసర, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిని ఇబ్బందుల పాలు చేసిందన్నారు. దేశంలో ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయో మోదీ, ఆ పార్టీ నేతలు చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో లక్షలాది ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలోనే సంక్షేమంలో మనరాష్ట్రం మొదటిస్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్ర మంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం, వార్డు కౌన్సిలర్లు సంజయ్, అశోక్ స్వామి, మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, నాయకులు దివ్య, తమల చందు, సురేందర్గౌడ్, బోయర్ కపిల్, వినోద్, ధారాసింగ్, రాజు తదితరులు పాల్గొన్నారు
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ ఈ నాలుగేళ్లలో.. మీ కాలనీకి ఎప్పుడైనా వచ్చిండా..ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా అని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్, దుర్గానగర్, శంకర్ గుట్ట, ఖొజా కాలనీలకు చెందిన 300 మంది కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు రత్న కిషోర్, శ్యామ్రావు, లక్ష్మారెడ్డి, శ్రావణి, శంకర్ శ్రీకాంత్ బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డుల్లో అభివృద్ధి పనులకు తక్షణం రూ.30 లక్షలు మం జూరు చేస్తున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జిల్లా బీజేపీలో మూడు ముక్కలాట, అందు లో కుమ్ములాట లాగా పరిస్థితి ఉందన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా వచ్చే నెలలో కలెక్టర్ సమక్షంలో లక్కీడ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి, సొంత జాగ ఉన్నవారికి రూ.3 లక్షలు అందిస్తామన్నారు. మరికొందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపి ణీ చేస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, వార్డు కౌన్సిలర్లు భరత్ కుమార్, పవన్నాయక్, అర్చనా రామ్కుమార్, వెనకంటి ప్రకాశ్, మాజీ వైస్ ఎంపీపీ బీ గంగారెడ్డి, మాజీ వార్డు సభ్యురాలు గీత, బీఆర్ఎస్ నాయకులు జోగు మహేందర్, ఈర్ల దయాకర్, ఏ నవీన్, సతీశ్ యాదవ్, రాజు, దాసరి రమేశ్, మిట్టపురె యోగేశ్, ఉన్నారు.