భైంసా, ఫిబ్రవరి 23 : అన్ని వర్గాల సంక్షేమ మేధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. భైం సా ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, నిరుపేద కుటుంబాలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్ర భుత్వాల హయాంలో పేదలకు ఒరిగిందేమీలేదన్నారు. ఎన్నో ఏండ్లుగా ఇండ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న వారికి అందజేసినట్లు చెప్పారు. సీ ఎం కేసీఆర్ ప్రతీ కుటుంబంలో ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సా యం అందించి మేనమామగా మారారని పేర్కొన్నారు. అనంతరం 58 జీవో కింది నిరుపేదలకు 630 పట్టాలు, 222 షాదీముబారక్ చెక్కులు, 85 కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో రవికుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో గోపాలకృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సోలంకి భీంరావు, గణేశ్, అహాద్, వాసే, జావీద్, సాయినాథ్, తూమ్ రాజేశ్వర్, విజయ్, కౌన్సిలర్ అమీర్ ఉన్నారు.
శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం..
బాసర, ఫిబ్రవరి 23 : బాసరలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ రావు, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.