బెల్లంపల్లి, మే 12: రోగుల పట్ల నర్సులు చూపించే అప్యాయత, సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం బెల్లంపల్లి వంద పడకల దవాఖాన, సింగరేణి ఏరియా దవాఖానాల్లో వేర్వేరుగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. నర్సులను సత్కరించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నర్సు వృత్తి చాలా గొప్పదని వారి సేవలను కొనియాడారు.
కరోనా, ఆపత్కాల సమయంలో నర్సులు చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, సింగరేణి ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ రామల శౌరీ, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ రవికుమార్, ఎంపీపీ శ్రీనివాస్, కౌన్సిలర్ గెల్లి రాజలింగు, ఏరియా దవాఖాన పిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, నాయకులు లక్ష్మణ్, భీమాగౌడ్, రమేశ్, వెంకటేశ్, వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.