శ్రీరాంపూర్, నవంబర్ 24: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే సిం గరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారందరికీ ఇండ్ల స్థలాల ప ట్టాలు అందుతున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శ్రీరాంపూర్ 9వ వార్డు వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉంటున్న పలువురికి ఇండ్ల స్థలాల పట్టాలు గురువారం అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆధీనంలో ఉన్న అటవీ భూమిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలందరికీ పట్టాలు ఇస్తున్నదని చెప్పారు.
మంచిర్యాల జిల్లాలో 2వేల ఎకరాల స్థలంలో నివాసులందరికీ పట్టాలు కల్పిస్తామని తెలిపారు. శ్రీరాంపూర్, నస్పూర్ కాలనీలో ఇప్పటి వ రకు 300 మందికి పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, కౌన్సిలర్లు మహేశ్, కుమార్, బేర సత్యనారాయణ, బెడిక లక్షి, పంబాల గంగాఎర్రయ్య, ముత్తె రాజేశం, నాజర్, ప్రకాశ్రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అక్కూ రి సుబ్బయ్య, నాయకులు మహేందర్ పాల్గొన్నారు.