ఇంద్రవెల్లి, నవంబర్ 20 : ఈ నెల 30వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని దేవాపూర్, ముత్నూర్, శంకర్ గూడ, ఇన్కర్గూడ, గిన్నేరా, బీక్కుతండా, ధనోరా(బీ), దనోరా(కే), ఇంద్రవెల్లి గ్రామాల్లో మండల నాయకులతోపాటు కలిసి పర్యటించా రు. ఈ సందర్భంగా మండలంలోని ధనోరా (బీ)గ్రామంలోని విఠల్రుక్మాయి, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామ స్తులతోపాటు మహిళలు, యువకుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రాబో యే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, బీఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, దుర్గంట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, ఉట్నూర్ జడ్పీటీసీ చారులత,
వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్సింగ్, మండల కోఆప్షన్ సభ్యుడు మీర్జా జిలానీబేగ్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కనక హనుమంత్రావ్, ఆరెల్లి రాందాస్, ఎంపీ టీసీ కోవ రాజేశ్వర్, మడావి భీంరావ్, మాజీ వైస్ ఎంపీపీ విజయ్కుమార్, సర్పంచ్లు జాదవ్ లఖన్సింగ్, ఏర్మ జాకేశ్వర్, ఆడే విజయ, రాం చందర్, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గణేశ్ డోంగ్రే, కోరెంగా సుంకట్రావ్, శ్రీనివాస్, ప్రకాశ్, రాంనివాస్, శివాజీ, సుంగుపటేల్, సోయం భీంరావ్, ఆత్రం ధర్ము, తోడసం హరి దాస్, జాదవ్ జమునాయక్, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెంబి, నబంబర్ 20 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇటీవల బీఆర్ ఎస్కు రాజీనామా చేసిన ఎంపీటీసీ రామారావు, పుల్గంపాండ్రి గ్రామానికి చెంది సర్పంచ్ భర్త కనిరాం తిరిగి ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి భుక్యా జాన్సన్ నాయక్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్య క్షుడు సల్లా నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ జానుబాయి, వైస్ ఎంపీపీ గంగా రెడ్డి, సర్పంచ్ మహేందర్ నాయకులు పాల్గొన్నారు. కాగా ఇటిక్యాలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ జానుబాయి ప్రచారం నిర్వ హించారు. సర్పంచ్ మహేందర్, నాయకులు భుక్యా గోవింద్, బడుగు మల్లేశ్, గాండ్ల శంకర్, సుతారి రమేశ్, రూప్సింగ్, కొడగంటి నర్సయ్య, తుర్క మోహన్ రెడ్డి, బోరే రమేశ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, నవంబర్ 19 : కారు గుర్తు కు ఓటు వేసి ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్ను అధిక మెజార్టీతో గెలిపించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కోరారు. కుమ్మరితండాలో జడ్పీ టీసీ చారులత రాథోడ, ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్ శ్రీరాం జాదవ్, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిం టా కరపత్రాలు పంచుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాగ్నే నారా యణ, ముకుంద్రావు, జాదవ్ రమేశ్, రంజిత్ నాయక్, రూప్సింగ్ నాయక్, ఆడే సుభాష్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
అలాగే బిర్సా యిపేట్ గ్రామంలో డీసీసీబీ డైరెక్టర్ ప్రభా కర్రెడ్డి నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వ హించారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన బీఆర్ఎస్ని మరోసారి గెలిపించాలని కోరారు. సర్పంచ్ అంకవ్వ, బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు కందుకూరి రమేశ్, ప్రధాన కార్యదర్శి సెడ్మకి సీతారాం, ముజీబ్, కుటికెల ఆశన్న పాల్గొ న్నారు. లక్కారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయ కుడు మర్సుకోల తిరుపతి ప్రచారం నిర్వహిం చారు. ఉప సర్పంచ్ కోల సత్తన్న, భూమన్న, దూట మహేందర్, మక్బుల్, బల వంత్, ముం జం అనుదీప్, గంగేశ్వర్, ఆశన్న, గవాస్కర్, ప్రవీ ణ్, మర్సుకోల సరస్వతి, పోసక్క, బబిత, రంజ నాబాయి, రాజమణి, గంగరాజు, సాజిత్ సిద్ధిఖీ, కేశవ్, సురేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, నవంబర్ 20 : మండలంలోని గొడిసెర్యాల గ్రామానికి చెందిన బీజేపీకి చెందిన 200 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సంద ర్భంగా సర్పంచ్ ఒడిసె పోశవ్వ, బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్ వారిని ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాటలు నమ్మవద్దన్నారు. ఉప సర్పంచ్ ఒడిసె మాణిక్ రావు, నాయకులు అర్గుల రాజనర్సయ్య, సంతపూరి శ్రీనివాస్, నిమ్మతోట శివయ్య, దాసరి సుధాకర్, కొండ్ర రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్, నవంబర్ 20 : శ్రీరాంనగర్, విద్యానగర్, పద్మావతీనగర్లో బీఆర్ఎస్ నాయ కులు ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జన్సాన్నాయక్ గెలిపించాలని కోరారు. నాయకు లు సల్లా చంద్రవాస్, పంబాల భీమేశ్, మెహ్రజ్, నారాయణ, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కడెం, నవంబర్ 20 : మండలంలోని కన్నా పూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి కీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీఆర్ ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి భుక్యా జాన్సన్ నాయక్ను గెలిపించాలని అభ్యర్ధించారు. నాయ కులు సయ్యద్ నుస్రత్, ఆర్ల రాజేశ్వరి, కరుణ, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, నవంబర్ 20 : తర్లపాడు గ్రామంలో ఎంపీపీ మొహిద్ ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ నాయకులు ప్రచారం చేశారు. గోడల పంపు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కరిపె శ్రీనివాస్, గోసంపల్లెలో మండల ప్రధాన కార్య దర్శి తూము చరణ్, ఉప సర్పంచ్ నమెడ ధర్శ రాజు ప్రచారం చేపట్టారు. పెద్ది నర్సయ్య, రామి డి మహేశ్, పెద్ది మల్లేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.