చెన్నూర్ రూరల్, నవంబర్ 20: కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారని, ఉచిత కరెంట్ కాదు కదా ఉన్న కరెంట్ కూడా పోతుందని చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ మండలంలో ప్రజాప్రతినిధులతో సుద్దాల, గంగారం, కమ్మరిపల్లి, అంగ్రాజ్పల్లి, కత్తెరశాల, సుబ్బరాంపల్లి, రాయిపేట, నారాయణపూర్, బావురావుపేట, ఎల్లక్కపేట, లింగంపల్లి, కిష్టంపేట గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ముందుగా సుద్దాల గ్రామంలోని శ్రీ సీతారామాలయంలో సుమన్ సతీమణి రాణి అలేఖ్యతో పూజలు చేశారు. అన్ని గ్రామాల్లో సుమన్కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో ఒక్క రోజు కూడా 24 గంటల కరెంట్ ఒక్క గ్రామానికీ ఇవ్వలేదనీ, వారికి మళ్లీ అవకాశం వస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు.
మళ్లీ మనం 60 ఏండ్ల వెనకకు పోతామని, ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుందని, రైతులు వ్యవసాయం మానుకొని పట్టణాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. విద్య, వైద్యం అందక చాలా నష్టపోతామని, ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ధరణిపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. చెన్నూర్ నియోజక వర్గంలో ఇప్పటి వరకు సుమారుగా రూ. 2 వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశానని తెలిపారు. ఇంకా కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. ఎన్నికలకు నెల ముందు వచ్చి దొంగ మాటలు చెప్పే వివేక్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వెంకట స్వామి, చిన్న కొడుకు వివేక్, పెద్ద కొడుకు గడ్డం వినోద్ చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారని కానీ చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. కోటి కూడా తీసుకరాలేక పోయారన్నారు.
ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హయాంలో కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సుద్దాల వాగుపై బ్రిడ్జి కడుతానని ఇచ్చిన హామీ మేరకు రూ.15 కోట్లతో సుద్దాల వాగుపై 10 నెలల్లో బ్రిడ్జిని నిర్మించి 10 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలను నమ్మి రైతులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు మోసపోవద్దని తెలిపారు. మళ్లీ సీఎం కేసీఆర్ అయితే రానున్న మరో 5 ఏండ్లు ప్రతి గ్రామ పట్టణంలో మరెంతో అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, మాజీ జడ్పీటీసీ బెల్లంకొండ కరుణాసాగర్ రావు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మందమర్రి, నవంబర్ 20: బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజక వర్గం అభ్యర్ధి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు పాలచెట్టు ఏరియా, మూడవ జోన్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పలు వార్డుకు చెందిన సుమారు 200 మంది బీఆర్ఎస్లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశానికి వచ్చిన విప్ సుమన్ను వార్డు ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా విప్ బాల్క సుమన్ మా ట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, పట్టణ ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఓ.రాజశేఖర్, బండారు సూరిబాబు, వార్డు నాయకులు నలువాల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్, నవంబర్ 20: చెన్నూర్ పట్టణంలో అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు కమ్మల శ్రీనివాస్, వేల్పుల సుధాకర్, రేవెల్లి మహేశ్, జగన్నాథుల శ్రీను, జోడు శంకర్, దోమకొండ అనిల్, తుమ్మ రమేశ్, వేముల శారద, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, జాడి తిరుపతి, నాయిని సతీశ్, ఆరీఫ్, మేడ సురేశ్రెడ్డి, పెండ్యాల లక్ష్మణ్, వెంకటనర్సయ్య, తదితరులున్నారు.
జైపూర్, నవంబర్ 20: మండలంలోని వేలాల, కుందారం, పౌనూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి బోడ జనార్దన్ జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ రమాదేవి, సీనియర్ నాయకులు రిక్కుల మధూకర్రెడ్డి, సురేందర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేసి చెన్నూర్ అభ్యర్థి బాల్క సుమన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
భీమారం, నవంబర్ 20 : భీమారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల ప్రచారాలు జోరందుకున్నాయి. భీమారం మండల కేంద్రంలో షాప్లను తిరుగుతూ చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, నవంబర్ 20: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్లో 17 వార్డు కౌన్సిలర్ రామడి రమాదేవి కుమార్ ఆధ్వర్యంలో భగత్సింగ్నగర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. 21వ వార్డు కౌన్సిలర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో భగత్సింగ్నగర్ విజయగణపతి దేవాలయం ఏరియా, కాయకూరల మార్కెట్లో, 22వ వార్డులో ఇన్చార్జి దాసరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో, 7వ వార్డులో కౌన్సిలర్ పొలం సత్యనారాయణ, 8వ వార్డు కౌన్సిలర్ అలుగుల శ్రీలత సత్తయ్య, 9వ వార్డు కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల్లో పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్గౌడ్, పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, నాయకులు రాజారమేశ్బాబు, పత్తి శ్రీనివాస్ దుర్గం శంకర్, దుర్గం వెంకటేశ్, దుర్గం శివ కుమార్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
మందమర్రి, నవంబర్ 20: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని కార్మిక కాలనీలతో పాటు గాంధీనగర్, రాజీవ్ నగర్, శాంతినగర్, యాపల్, శ్రీపతినగర్, దీపక్ నగర్, రామన్ కాలనీ, అంగడిబజార్ ఏరియా, సీఎస్పీ రోడ్డు ఏరియాల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ర్యాలీలు తీశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్, మహిళా విభాగం, యూత్, సోషల్ మీడియా వారియన్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.