బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు, ప్రగతి ప్రదాత కల్వకుంట్ల తారకరామారావు సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పర్యటించను న్నారు. రూ.94.89 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దశాబ్దాల పాటు కలగా మిగిలిన రహదారులకు మోక్షం కలుగ నుంది. పట్టణ శివారులోని 350 ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు శంకుస్థాపన చేయనున్నారు. ఫలితంగా వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. రూ.44 కోట్ల మిషన్ భగీరథ, పంప్హౌస్, వాటర్ ట్యాంక్ను ప్రారంభించనున్నారు. అలాగే ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి, వ్యాపారాలు చేసుకునే వారికి కూడా పట్టాల పంపిణీ చేయనున్నారు.
– మంచిర్యాల, మే 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, మే 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని బెల్లంపల్లి నియోజకవర్గం స్వరాష్ట్రంలో బాగు పడుతున్నది. గడిచిన ఎనిమిదేళ్లలో అసాధ్యం అనుకున్న సింగరేణి స్థలాల ఇండ్ల పట్టాల పంపిణీ సుసాధ్యమైంది. రోగం వచ్చినా, నొప్పి వచ్చినా మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా.. వంద పడకల దవాఖాన ప్రారంభమైంది. గురుకుల పాఠశాలలు, కళాశాలలతో బెల్లంపల్లిలో విద్యావవస్థ పటిష్టమైంది. ఒకప్పుడు రోడ్లు లేక.. వర్షాకాలంలో వాగులు, కాలువలు పొంగి నీట మునిగిన ఎన్నో గ్రామాలకు బీటీ రోడ్లు వచ్చాయి.
కాలువలు, వాగులపై బ్రిడ్జిలు వచ్చాయి. ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య సారథ్యంతో తెలంగాణ సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతుంటే.. అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం బెల్లంపల్లిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.94.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా డిమాండ్లుగానే మిగిలిన గ్రామాలకు రోడ్లు రానున్నాయి. నియోజకవర్గవాసులను ఊరిస్తున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. బెల్లంపల్లివాసులకు తాగునీరు అందించేందుకు రూ.44 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పంప్హౌస్, వాటర్ ట్యాంక్లను మంత్రి ప్రారంభించనున్నారు.
350 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్
బెల్లంపల్లి పట్టణ శివారులో 350 ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు సోమవారం శంకుస్థాపన రాయి పడనుంది. దీంతో వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ప్రస్తుతం 350 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ వస్తున్నా.. భవిష్యత్లో దాన్ని మరో 150 ఎకరాలకు విస్తరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సరిపడా భూమి అందుబాటులో ఉంది. దీనితోపాటు బెల్లంపల్లి పట్టణంలో రూ.6.72 కోట్లతో రైతుబజార్, మార్కెట్రోడ్, శిశుమందిర్ రోడ్డు వైండింగ్ పనులు, పెద్దన్నపల్లి సీసీ డ్రెయిన్, పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రవీంద్రనగర్ వరకు రోడ్ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇవి కాకుండా మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న పనుల వివరాలు ఇవే..
ఉపాధి మార్గం చూపాలి..
ఒకప్పుడు సింగరేణి గనులతో కళకళలాడిన బెల్లంపల్లి.. ఇప్పుడు గనులు లేకుండా పోయాయి. దీంతో ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారి కుటుంబాల్లోకి యువతకు చాలా మందికి ఉపాధి దొరకడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక యువతకు ఉపాధి చూపించేలా ఏదైనా పరిశ్రమల ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో పరిశ్రమ ఏర్పాటుపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. సనాతన అనలైటిక్స్ అండ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వాల్యూ పిచ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఇంటరాక్ట్ కానున్నారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పనుల వివరాలు..