కాసిపేట, మే 7 : కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి సోమవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి ప్లాంట్ విస్తరణ కోసం పునాది రాయి వేయనున్నారు.
సోమవారం మొదటగా ఉదయం 11 గంటలకు నేరుగా దేవాపూర్ వచ్చి నాలుగో ప్లాంట్కు పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేస్తారు. మంత్రి పర్యటన కోసం ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. ఓరియంట్ ప్లాంట్ విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉండడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.