సారంగాపూర్, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీ లకు భయం పట్టుకుందని, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరరణ్రెడ్డి అన్నారు. మంళవారం స్వర్ణ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అబ్దుల్ మజార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేప్టీలకు చెందిన 50 మంది మైనార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలను పాలిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలున్నాయా అని ప్రశ్నించారు. ఆ రాష్ర్టాల్లో పింఛన్ రూ. 600 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించి మూడోసారీ సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ
మండల కేంద్రంలోని ఊరగుట్టలో రూ. 20లక్షలతో పెద్దమ్మతల్లి, రూ. 50 లక్షలతో మార్కండేయ స్వామి, రూ. 26 లక్షలతో నూతనంగా మంజూరైన దేవాలయ నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో రూ. 115.45 కోట్లతో 673 దేవాలయాలు, సారంగాపూర్ మండలంలో 124 దేవాలయాలకు రూ. 25.26 కోట్లు వెచ్చించి ఆధునీకరించామన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలని, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, నిర్మల్ మార్కెట్ చైర్మన్ చిలుక రమణ, ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ మాణిక్రెడ్డి, సర్పంచ్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజ్మహ్మద్, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు పిల్లి నాగయ్య, నాయకులు కొత్తింటి మల్లేశ్, పాకాల రాంచందర్, దేవి శంకర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 26 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివేకానంద్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీకని కొనియాడారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. రజకులకు దోబీఘాట్లు, లాండ్రి దుకాణాలు, నాయీ బ్రాహ్మణులకు క్షౌర శాలలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నామని వివరించారు. అంతకుముందు మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శివాజీ చౌక్ మీదుగా ఐలమ్మ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు అడ్ప విజయలక్ష్మీపోశెట్టి, గండ్రత్ రమణ, బిట్లింగ్ నవీన్, నరేందర్, కౌన్సిలర్లు, నాయకులు, కులసంఘ సభ్యులు పాల్గొన్నారు.
శోభాయాత్ర ప్రారంభం
నిర్మల్ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కర్ర వినాయక నిమజ్జన శోభాయాత్రను మంత్రి అల్లోల ప్రారంభించారు. మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
విద్యార్థులను అభినందించిన మంత్రి
నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యోగా పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికైన అవినాశ్, మనీశ్, రవీందర్, చవీన్ను మంత్రి క్యాంపు కార్యాలయంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అబినందించారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ర్టానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యోగా అధ్యక్షురాలు అన్నపూర్ణ, డాక్టర్ కృష్ణంరాజు తదితరులున్నారు.
అభివృద్ధికి మద్దతుగా చేరికలు
మామడ, సెప్టెంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మద్దతుగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాయిద్పెల్లికి చెందిన 70 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా మంత్రి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తొమ్మిందేండ్లలో ఎంతో ప్రగతి సాధించమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కొరిపెల్లి రాంకిషన్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ పాకాల చంద్రశేఖర్గౌడ్, సర్పంచ్ రాందాస్, నాయకులు ఉన్నారు.