స్వరాష్ట్రంలోనే పూర్తిస్థాయిలో నిధులు
అనంతపేట్లో ఒకే చోట బడి-గుడి నిర్మాణం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం
సోన్, మే 6: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్లో రూ. 38లక్షలతో దేవాదాయశాఖ నిధులతో నిర్మించిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రికి మహిళలు, వేద పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వరాష్ట్రంలోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామంలో రూ. 38లక్షలతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని పేర్కొన్నారు.
అనంతపేట్ సమీపంలో గల బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయాన్ని కూడా రూ. 5కోట్లతో అద్భుతంగా నిర్మిస్తున్నామని చెప్పారు. లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం పక్కన కేజీబీవీ విద్యాలయాన్ని కూడా రూ. 4కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తనతో చదువుకున్న జగన్మోహన్రెడ్డితో తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా పాల్గొని జైలుకు వెళ్లామని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కే విజయలక్ష్మి, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, సర్పంచ్ నేరెళ్ల విజయ, ఎంపీటీసీ గాండ్ల లలిత, టీఆర్ఎస్ నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు అల్లోల సురేందర్రెడ్డి, డీఈవో రవీందర్రెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, నాయకులు గాండ్ల విలాస్, సూరపు సాయన్న, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్రావు, ఎంపీవో తుల రామకృష్ణ, వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
లక్ష్మణచాంద, మే 6 : ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో రూ. 10 లక్షలతో నిర్మించిన మార్కండేయ ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం లక్ష్మణచాంద గ్రామంలోని ఆలయాలకు రూ. 2.6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజాసంక్షేమంకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అయిత చండీయాగం చేశారని తెలిపారు. మార్కండేయ ఆలయాన్ని పూర్తిచేయడానికి మరో రూ. 25 లక్షలు కావాలని గ్రామస్తులు కోరగా, మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో రహదారి ఇరుకుగా ఉండడంతో రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ సాతం గంగారాం, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో శేఖర్, నాయకులు గుజ్జారి గణేశ్, కేశం రమేశ్, సిరాజొద్దీన్ పాల్గొన్నారు.