ఆదిలాబాద్, అక్టోబర్ 27 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగం గా నిర్వహించే సభల్లో శనివారం మంత్రి హరీశ్ రావు పాల్గొననున్నారు. జిల్లాలో రెండు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం పది గంటలకు ఆయన ఉట్నూర్ చేరుకుంటారు. మండలపరిషత్ మైదానంలో ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్ధి జాన్సన్నాయక్కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
అనంతరం ఆదిలాబాద్కు చేరుకొని 12 గంటలకు డైట్ కళాశాల మైదానంలో ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే జోగు రామన్నకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు హాజ రై ప్రసంగిస్తారు. ఇప్పటికే రెండు చోట్లా నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉట్నూర్ సభ ఏర్పాట్లను జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరిశీలించారు. ఆదిలాబాద్ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్ జాదవ్ పరిశీలించారు. పెద్ద సంఖ్యలో జనసమీకరణకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు మమ్మరంగా ప్రచారం చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్నా రు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్లో అభ్యర్థి అనిల్జాదవ్, ఖానాపూర్లో అభ్యర్థి జాన్సన్ నాయక్ గ్రామాల్లో ఇంటింటా ప్రచా రం చేస్తున్నారు. ప్రభుత్వం పదేళ్లుగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నది. సభలు, సమావేశాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో ద్వారా ఎన్నికల తర్వాత కలిగే ప్రయోజనాలను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా గులాబీ పార్టీకి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణ చూసి పార్టీ అభ్యర్థులు, నాయకులు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.