సారంగాపూర్, ఏప్రిల్ 3 : సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం స్వరాష్ట్రలో పండుగలా మారిందని, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. మండలంలోని రాంసింగ్తండాలో రూ.1.10 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్, జామ్-బీరవెల్లి వరకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో హైలెవల్ వంతెన నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక పల్లెలు, పట్టణాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 58 సబ్స్టేషన్లు నిర్మించుకున్నట్లు, ఒక్క సారంగాపూర్ మండలంలోనే 10 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నీటి ఎద్దడి లేకుండా మండలంలో స్వర్ణ వాగుపై 6 చెక్డ్యామ్లు నిర్మించామని పేర్కొన్నారు.
వాటిలో నీళ్లు పుష్కలంగా ఉండి, భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం చేశారు. అడెల్లి మహా పోచమ్మ ఆలయ నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు, పనులు కూడా ప్రారంభించుకున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో రూ.కోటితో జగదాంబా మాతా సేవాలాల్ మందిరాన్ని నిర్మిస్తామని, రూ.కోట్లతో నిర్మల్లో బంజార భవన్ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మంగళవారం స్వర్ణ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్లో జరిగే ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఆత్మీయ సమ్మేళనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చై ర్మన్ అయిటి చందు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దత్తురాం, నాయకులు రాజేశ్వర్రెడ్డి, కరుణాసాగర్రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద, ఏప్రిల్ 3 : మండల కేంద్రంలోని కేఎన్ఆర్ ఫంక్షన్ హాలులో లక్ష్మణచాంద, మామడ మండలాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు మంత్రి అల్లోల కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ వంటి పథకం ఏ రాష్ట్రంలోనూ అమలుకావడం లేదన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని పేర్కొన్నారు. ఇంటింటికీ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిజరుగుతున్నదని తెలిపారు. రైతులు సంతోషంగా ఉన్నట్లు ఏ రాష్ట్రంలో లేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, మంత్రి సోదరుడు, లక్ష్మణచాంద బీఆర్ఎస్ ఇన్చార్జి అల్లోల సురేంధర్ రెడ్డి, రైతు బంధు సమితి మామాడ మండల కన్వీనర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ కేశం లక్ష్మి, నాయకులు ప్రతాప్రెడ్డి, కొండ్ర నరేశ్రెడ్డి, కేశం రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.