నిర్మల్ టౌన్, మార్చి 25 : ప్రభుత్వం అమలు చేసే పథకం ఏదైనా అవార్డులు తెలంగాణ రాష్ర్టా న్నే వరిస్తున్నాయని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పంచాయతీరాజ్ అవార్డు-23లో దేశంలో మరోసారి సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జాతీయస్థాయి పంచాయతీరాజ్ అవార్డు (దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ)కు జిల్లాస్థాయి లో ఎంపికైన 27 మంది సర్పంచులకు శనివారం జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో జిల్లా పంచాయ తీ అధికారి శ్రీలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి అవార్డులు ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. రాష్ట్రంలో పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అన్ని విభాగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడం వల్లే అవార్డులు వచ్చాయన్నారు.
గ్రామ పంచాయతీలో పరిశుభ్రత, నీటి సరఫరా, లీడర్షిప్, మహిళల అభివృద్ధి, సాధికారిత తదితర అం శాల్లో ఈ అవార్డులకు ఎంపిక చేశారని పేర్కొన్నా రు. జిల్లాస్థాయిలో ఎంపికైన వారు ఈ నెల 31న రాష్ట్రస్థాయిలో, అక్కడ ఎంపికైన వారు జాతీయస్థాయికి ఎంపికవుతారని చెప్పారు. అవార్డులు రావడానికి ప్రజల సహకారం, మండలస్థాయిలో పనిచేసే అధికారుల ప్రోత్సాహం, ప్రజాప్రతినిధు ల కష్టం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీఎల్పీవో శివకృష్ణ, ఎంపీపీలు రామేశ్వర్రెడ్డి, మహిపాల్రెడ్డి, జడ్పీటీసీలు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, రమణారెడ్డి, శారద, జడ్పీ కో ఆప్షన్ సభ్యు లు సుభాష్రావు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.