సోన్, జూలై 17: కొండాపూర్ కస్తూర్బాగాంధీ విద్యాలయం ప్రారంభోత్సవాకి సి ద్ధమైంది. కేజీబీవీల్లో కార్పొరేట్స్థాయి విద్య ను అందించే లక్ష్యంతో సొంత భవనాలతో పాటు ఆధునిక వసతులను ప్రభుత్వం కల్పి స్తున్నది. నిర్మల్ మండలంలోని కొండాపూర్ కేజీబీవీ పాఠశాలను మొదటగా కొండాపూర్లోనే ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించగా, అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో సారంగాపూర్ మండలం జామ్ సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలకు మార్చారు. మూడేళ్ల నుం చి అక్కడే విద్యాబోధన చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక కృషి తో 2021లో కొండాపూర్ కేజీబీవీ పాఠశాల భవనానికి నిర్మల్ మండలం అనంతపేట్ గ్రా మ శివారులో నిర్మించేందుకు రూ. 3.80 కో ట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కేజీబీ వీ కొత్త భవనాన్ని నిర్మించారు. భవనంలో వి ద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయలు కల్పించారు. తరగతి గదులతో పా టు డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, రీడింగ్ హా లు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, ల్యా బ్, స్టాఫ్రూం నిర్మించారు.
మోడల్ స్థాయిలో..
కేజీబీవీ పాఠశాలలకు ప్రాధాన్యత పెరిగిన నే పథ్యంలో సుమారు రెండున్నర ఎకరాల్లో మూడొంతస్తుల భవనాన్ని నిర్మించారు. నిర్మ ల్ పట్టణం నుంచి అనంతపేట్కు వెళ్లే రోడ్డు ను ఆనుకొని కార్పొరేట్ విద్యాసంస్థ తరహా లో ఈ భవనం నిర్మాణ పనులు పూర్తి చేశా రు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయుల అవసరాలను తీర్చే విధంగా వసతులు కల్పించారు. ప్రస్తుతం జామ్లో నిర్వహించబడుతున్న కొండాపూర్ కేజీబీవీని మరో రెండు, మూడు రోజుల్లో కొత్త పాఠశాలకు మార్చనున్నారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ పాఠశాలను అనంతపేట్ గ్రామ శివారులో నిర్మించి న కొత్త భవనంలోకి మార్చడం వల్ల విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని వి ద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. భవిష్యత్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా మోడల్ ఎడ్యుకేషన్ సిస్టంను అమలు చేసేందుకు కార్యచరణను కూడా రూపొందిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
నేడు ప్రారంభం..
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మంగళవా రం ఉదయం 11.30 గంటలకు కేజీబీవీ భవనాన్ని ప్రారంభించనున్నట్లు పాఠశాల ఎస్వో శ్రీలత తెలిపారు. మంత్రితో పాటు జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి, డీఈవో రవీందర్రెడ్డి హాజరుకానున్నారని ఆమె తెలిపారు.