మామడ/లక్ష్మణచాంద, జూలై 6 : సీఎం కేసీఆర్ అధికారంలో ఉంటేనే రైతులకు భరోసా ఉంటుందని, పోడు పట్టాల పంపిణీతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం 3,061 ఎకరాల భూమిని 1,152 మంది గిరిజనులకు కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ పోడు భూముల పట్టాల పంపిణీతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని అన్నారు.
పోడు భూములకు త్రీఫేజ్ కరెంట్తో పాటు గిరివికాస్ పథకం కింద బోర్లు వేయించడం జరుగుతుందన్నారు. తండాలను పంచాయతీలుగా గుర్తించడంతో పాటు అభివృద్ధికి నిధుల కేటాయింపు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు వంటివి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతాయన్నారు. అలాగే లక్ష్మణచాంద మండలంలోని చింతల్చాందకు చెందిన ముగ్గురికి, బోరిగాంకు చెందిన ఒకరికి పోడు పట్టాను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ హన్మగౌడ్, వైస్ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, డీటీడీవో అంబాజీ, ఆర్డీవో స్రవంతి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘనందన్రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, బీఆర్ఎస్ మామడ, లక్ష్మణచాంద మండలాల కన్వీనర్లు చంద్రశేఖర్గౌడ్, కృష్ణారెడ్డి, డీఎస్పీ జీవన్రెడ్డి, మామడ ఎంపీడీవో రమేశ్, లక్ష్మణచాంద ఎంపీడీవో శేఖర్, తహసీల్దార్ ఆరిఫా, ఎఫ్ఆర్వోలు అవినాశ్, పుండలిక్, ఏవో నాగరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్
సారంగాపూర్, జూలై 6 : పోడు భూముల పట్టాలు ఇచ్చి గిరిజన ప్రజల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సారంగాపూర్లోని మార్కెట్ యార్డులో 734 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా్రష్ట్ర వ్యాప్తంగా 4లక్షల ఎకరాల అటవీ భూములను 1.50 లక్షల మంది గిరిజనులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం రవీంద్రనగర్ తండాలో పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములను పరిశీలించి ఎడ్లనాగలి పట్టి భూమిని దున్నాడు. అలాగే లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జెట్టి లక్ష్మికి దివ్యాంగుల కోటా కింద మంజూరైన రూ. 50వేల సబ్సిడీ చెక్కును అందజేశారు.
యాకర్పల్లి గ్రామానికి చెందిన రాజేశ్వర్ కుమారుడు సిద్ధు బాసర ట్రిపుల్ఐటీకి ఎంపిక కావడంతో శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్రెడ్డి, డీటీడీవో అంబాజీ, ఆర్డీవో స్రవంతి, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, వైస్ఎంపీపీ పతాని రాధ, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, సర్పంచ్లు సుజాత, సుచరిత, ఎంపీటీసీ పద్మ, ఎంపీడీవో సరోజ, ఏవో రాజశేఖర్రెడ్డి, నాయకులు రాంచందర్, శ్రీనివాస్రెడ్డి, నాగయ్య, దేవిశంకర్, నర్సారెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు.