నిర్మల్ టౌన్/ నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 13 : యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో యాసంగి సీజన్ 2022-23కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా కల్పించలేదన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని పేర్కొన్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో వరి సాగు కాగా.. 17 లక్షల క్వింటాళ్ల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.2,060, బీ గ్రేడ్ రకానికి రూ.2,040 ధర నిర్ణయించినట్లు తెలిపారు.
ఐకేపీ, ఎఫ్ఏసీఎస్, పీఏసీఎస్, గిరిజన సొసైటీ ద్వారా 204 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 42.50 లక్షల గన్నీ బ్యాగులు అవసరముండగా, ఇప్పటివరకు 28.32 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. అనంతరం వరి ధాన్యానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను మంత్రి, కలెక్టర్ తదితరులు విడుదల చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీఎస్వో తనూజ, డీఎం శ్రీకళ పాల్గొన్నారు.
కంటి వెలుగు కేంద్రం తనిఖీ
నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకర ణ్ రెడ్డి సందర్శించారు. అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా జనవరి 18న సీఎం కేసీఆర్ ప్రా రంభించిన కంటి వెలుగు కార్యక్రమం అద్భుతం గా కొనసాగుతుందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో 30 కేంద్రాల్లో 2 లక్షల మందికి కంటి పరీక్షలు చే సి దృష్టిలోపం ఉన్న 21,500 మందికి ఉచితంగా కండ్ల అద్దాలను పంపిణీ చేశామన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజేందర్, నాయకుడు రాంకిషన్ రెడ్డి తదితరులున్నారు.
ఎంసెట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాలికా విద్యను బలోపేతం చేసేలా కేజీబీవీ విద్యార్థులకు అందిస్తున్న ఎంసెట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శాంతినగర్ కేజీబీవీ పాఠశాలలో జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎంసెట్ క్రాష్ కోర్సు ఉచిత శిక్షణను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఎంసెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు కచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైందని, మంచి ర్యాంకు సాధిస్తే స్థానికంగానే వైద్య విద్య అభ్యసించే అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థులకు ఎంసెట్ మెటీరియల్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్ సంపంగి రవి, డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి, పద్మ, శ్రీదేవి, ఎస్వో సుజాత, వివిధ కేజీబీవీల ఎస్వోలు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్ సర్కారే
ఆడవారి ఇంట ఆత్మగౌరవం పెంచిందని కేసీఆర్ సర్కారేనని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డులకు సంబంధించిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారుల కుటుంబాలకు అందించారు. మొత్తం 176 చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఆడపిల్లల పెండ్లిలు చేసిన కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్రెడ్డి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సుభాష్చందర్, మున్సిపల్ కమిషనర్ రాజు, బీఆర్ఎస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం దేశానికే రోల్మాడల్
సారంగాపూర్, ఏప్రిల్ 13 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా రు. సారంగాపూర్లోని రైతువేదిక భవనంలో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 77 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశా రు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తే బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని నిందించడం సరైన పద్ధతి కాదన్నా రు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇలాంటి బృహత్తర పథకాలున్నాయా? అని ప్రశ్నించారు.
విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, అడెల్లి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ ఎలిపెద్ది మాణిక్రెడ్డి, స ర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ సయ్యద్ ఇస్మాయిల్, నాయకులు రాజేశ్వర్రెడ్డి, నర్సారెడ్డి, కండెల భోజన్న, ముద్రం దినేశ్, తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఎంపీడీవో సరోజ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.