నిర్మల్ అర్బన్, అక్టోబర్ 8: రానున్న ఎన్నికల్లో 100కు పైగా సీట్లను గెలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇందకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో రూ.2.10 కోట్లతో చేపట్టనున్న సీసీ రో డ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి ఆయన ఆదివారం భూమి పూజ చేశారు. వార్డు నంబర్ 10లో రూ.70లక్షలు, వార్డు 11 కి రూ.60 లక్షలు, వార్డు 12 కి రూ.40 లక్షలు, వార్డు 13 కి రూ.40 లక్షలతో వార్డు ల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మల్ మున్సిపాల్టీకి రూ.75 కోట్ల నిధులు వచ్చాయని, వీటితో వార్డుల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ఓట్లడిగేందుకే జంకుతున్నారని అన్నారు. అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కట్టాలని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ గెలిపించాలని కోరారు. మంత్రిని కాలనీ వాసులు, ప్రజా ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. అనంతరం శాంతినగర్ క్రాస్ రోడ్డులో పీవీ నర్సింహరావు విగ్రహ ఏర్పాటు పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. సో మవారం విగ్రహ ప్రారంభోత్సవాన్ని నిర్వహించుకోనున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవో తు రాజేందర్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రా ము, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు సంపంగి రవి, శ్రీకాంత్, తులసీ నర్సాగౌడ్ తదితరులున్నారు.
సోన్, అక్టోబర్ 8: రానున్న రోజుల్లో పెన్షన్ను ము ఖ్యమంత్రికి చెప్పి మరింత పెంచుతామని మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలో ని వెంగ్వాపేట్లోని రూ. 7.15 కోట్లతో కొత్తగా నిర్మిం చనున్న చెక్డ్యాం పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెం గ్వాపేట్ గ్రామస్తుల చిరకాల కోరిక చెక్డ్యాం. మూడు కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉండడంతో పాటు 300 ఎకరాల ఆయకట్టు ఉండడంతో సాగుకు ఢోకా లేకుండాపోతుందన్నారు. ఈ వంతెన పూర్తయితే వెంగ్వాపే ట్ నుంచి కాల్వ, బీరవెల్లికి సులువుగా వెళ్లిపోవచ్చన్నా రు. ఈ నదిపై ఇప్పటివరకు 12 చెక్డ్యాంలను నిర్మించిట్లు తెలిపారు.
అనంతరం ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘ భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు లంగ్డాపూర్ గ్రామం వద్ద యువకులు మంత్రికి స్వాగతం పలికి అక్కడి నుంచి స్వర్ణ వాగు వరకు బైక్ర్యాలీ తీశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాట నమ్మితే మోసపోతామని మంత్రి అన్నారు. అక్కడ పింఛన్ ఎంతిస్తున్నారో తెలుసుకోవాలని పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్కే అవకాశమివ్వాలని కోరారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, గ్రామ సర్పంచ్ కొప్పుల గంగయ్య, ఎంపీటీసీ దుర్కి సాయన్న, ఇరిగేషన్ ఎస్ ఈ సుశీల్కుమార్, ఈఈ రామారావు, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మాజీ మండల కన్వీనర్ ముత్యంరెడ్డి, వీడీసీ వైస్ చైర్మన్ గుడాల తిరుపతి, సభ్యులు చంద్రగౌడ్, నాయకులు సాద విజయ్శేఖర్, సాదు గంగన్న, నవీన్రెడ్డి, గాడి నాగభూషణ్, కర్రోల్ల చిన్నయ్య, ఆకుల రమేశ్, కొబ్బాయి ర వి, కొప్పుల నర్సయ్య, పాల్గొన్నారు.