నిర్మల్ అర్బన్, అక్టోబర్ 22: సారంగపూర్ మం డలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏటా గంగనీళ్ల జాతర వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలోని గోదావరి నదికి కాలినడకన వెళ్లి, నగలు శుద్ధి చేసుకుని వస్తారని తెలిపా రు. గంగనీళ్ల జాతర ముగింపు సందర్భంగా వచ్చిన భక్తులకు విజయదశమి
దిలావర్పూర్, అక్టోబర్ 22: అడెల్లి పోచమ్మ గం గానీళ్ల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండంలోని సాంగ్వీ గ్రామ పరసర ప్రాంతంలో ఉన్న గోదావరిలో అడెల్లి పోచమ్మ అమ్మవారి నగలకు అభిషేకం నిర్వహించారు. అక్కడే గ్రామస్తులు వివిధ గ్రామాల నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అమ్మవారి నగలతో ప్రారంభమైన శోభాయాత్ర కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడెగాం, గ్రామాల మీదుగా కొనసాగింది. దిలావర్పూర్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి స్వాగతం పలికారు. గ్రామస్తు లు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శోభాయాత్రలో యువకులు, శివసత్తులు నృత్యాలు చేశా రు. నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
సోన్, అక్టోబర్ 22: సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో ఆదివారం గంగనీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిన్నూర్ గ్రామానికి చెందిన పోచమ్మ తల్లి ఆభరణాలకు శనివారం సాయంత్రం గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఆదివారం ఉదయం సోన్ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం పాదయాత్రగా గ్రామానికి చేరుకున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీడీసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
కుంటాల,అక్టోబర్, 22: దిలావర్పూర్లో ప్రారంభమైన గంగనీళ్ల జాతర ఆదివారం కుంటాల మం డల కేంద్రానికి చేరుకుంది. వీరికి గ్రామస్తులు భక్తు లు ఘన స్వాగతం పలికారు. గోదావరి నది నీళ్లతో కుంటాలలోని గజ్జలమ్మ ముత్యాలమ్మ, మహాలక్ష్మీ నగలను శుద్ధి చేసి విగ్రహాలను గంగనీటితో అభిషే కం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు , భక్తులు పాల్గొన్నారు.