మంచిర్యాల అర్బన్, మార్చి 11 : పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల కలెక్టరేట్ఎదుట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి రాజేశ్వరి, దాగం రాజారాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఇటు పాఠశాలలో భోజనం వండి పెట్టలేక, అటు కుటుంబాన్ని పోషించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. అనంతరం డీఈవో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, నాయకులు దూరం శ్రీనివాస్, బుచ్చన్న, లక్ష్మణ్, రఫియా, సునీత, పోసక్క, మధునక్క, వరలక్ష్మి, సరిత, విమల, జ్యోతి, లక్ష్మి, తిరుపతి పాల్గొన్నారు.