యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయ యాదవుల హకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ హాలులో ఆదివారం నిర్వహించిన యాదవ శంఖారావంలో మంచిర్యాల, షాద్నగర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, అంజయ్య యాదవ్, గొర్రెలు, మేకల ఫెడరేషన్ చైర్మన్ బాలరాజుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎస్ఎన్టీ రిజర్వేషన్ రద్దు చేసి గొల్లలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. దేశంలో యాదవులకు అత్యధికంగా రాజకీయావకాశాలు కల్పించిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. మతతత్వ పార్టీ, బీసీల సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీని సాగనంపాలని పిలుపునిచ్చారు.
– మంచిర్యాలటౌన్, మే 28
మంచిర్యాలటౌన్, మే 28 : యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మ న్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయ యాదవుల హకుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ హాలులో యాదవ శంఖారావం సభ నిర్వహించారు. గెల్లు శ్రీనివాస్తో పాటు మంచిర్యాల, షాద్నగర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, అంజయ్య యాదవ్, గొర్రెలు, మేకల ఫెడరేషన్ చైర్మన్ బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యాదవులకు తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఎస్ఎన్టీ రిజర్వేషన్ రద్దు చేసి యాదవులను సామాజికంగా, రాజకీయంగా ఎదగకుండా చేసిందని మండిపడ్డారు. యాదవులకు,బడుగు బలహీన వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్లు దకడంలో తీవ్ర జాప్యం చేసిందన్నారు.
దేశంలోనే యాదవులకు ఎక్కువగా రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. యాదవులు నిబద్ధతతో పని చేస్తారని, నికచ్చిగా ఉంటారని నమ్మి.. నాకు హుజూరాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశంలోనే యాదవ బిడ్డకు మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యత్వం కల్పించింది కేసీఆరే అని తెలిపారు. రాష్ట్ర శాసనసభలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కల్పించనన్ని అవకాశాలు యాదవులకు కల్పించారని, ఆరు సీట్లు ఇచ్చి ప్రోత్సహించారని చెప్పారు. ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని యాదవులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గొర్రెలు, మేకల ఫెడరేషన్ చైర్మన్ బాలరాజు మాట్లాడుతూ యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తుందని, వాటిని అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని, రాజకీయంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాటసమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సంపత్కుమార్ యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి గిరివేణి సంపత్కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు పెండ్లి అంజయ్య పాల్గొన్నారు.
బీసీల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీని సాగనంపాలి : గెల్లు శ్రీనివాస్ యాదవ్
బీసీల సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేష న్ చైర్మన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఇంకా అధికారంలో ఉంటే దేశం అంధకారంలో కి వెళ్లడం ఖాయమన్నారు. బీసీలు, విద్యార్థుల పట్ల ఆ పార్టీ వ్యతిరేకంగా ఉన్నదని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నదని, ప్రతి కార్యక్రమానికీ అడ్డు తగులుతుందని చెప్పుకొచ్చారు.
కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం నంబర్ వన్ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి వైద్యసేవలను విస్తరిస్తున్నామని, నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 104 గురుకులాలుం టే.. కేవలం ఒక్క తెలంగాణలోనే 104 గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత కేసీఆర్దేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మాట్లాడే అర్హత లేదని, వచ్చే ఎన్నికల్లో మతతత్వ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్ 20న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సంబురాలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పల్లె భూమేశ్, ఏనుగు రవీందర్రెడ్డి, అన్నయ్య, బింగి ప్రవీణ్, సుమన్, దగ్గుల మధూకర్, శ్రావణ్ పాల్గొన్నారు.