మందమర్రి, జనవరి 19: పట్టణంలో సమ్మక్క-సారలమ్మల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 21వ తేదీ నుంచి జాతర ప్రారంభంకానుండగా, పట్టణంలోని మార్కె ట్, పాతబస్టాండ్, యాపల్ ఏరియాల్లోని దుకాణాల యజమానులు భారీ ఎత్తున బెల్లం నిలువలను అందుబాటులో ఉం చారు.
శుక్రవారం పట్టణంలోని వివిధ కాలనీల్లో వందలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఎత్తు బంగారం కొనుగోలు చేశారు.