మంచిర్యాల అర్బన్, జనవరి 31: పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సా ధించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య సూచించారు. జిల్లాలోని హాజీపూర్, భీమారం, నస్పూర్, దండేపల్లి, మందమర్రి, జైపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని కేజీబీవీల ఎస్వోలు, మో డల్ స్కూల్ప్ ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ పది సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న ప్రణాళికలు అడిగి తెలుసుకున్నారు. ఏసీజీఈ దామోదర్ రావు, డీసీఈబీ సెక్రటరీ కొండు భీమ్రావ్, సెక్టోరియల్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి, యశోదర, మండల విద్యాధికారులు పోచయ్య, రాధాకృష్ణమూర్తి, డీసీఈబీ సహాయ కార్యదర్శి కుమార స్వామి పాల్గొన్నారు.