మందమర్రి, జనవరి 16 : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు పెరుగుతాయని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసు అధికారుల స్నేహ పూర్వక క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ సబ్ డివిజన్ జట్లతో పాటు మంచిర్యాల డీసీపీ జట్టు పాల్గొంది.
డీసీపీ జట్టు విజయం సాధించి ఫ్రెండ్లీ కప్ కైవసం చేసుకుంది. డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడల్లో తగు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ మోహన్, జిల్లాలోని అన్ని సర్కిల్ల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు