నస్పూర్, ఫిబ్రవరి 19 : అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
సోమవారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభావత్ మోతీలాల్, ఆర్డీవోలు రాములు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 57 దరఖాస్తులు అందాయని, అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.