నస్పూర్, జనవరి 10 : నిరుద్యోగ అంధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా స్త్రీ శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 215వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, డీఆర్డీవో శేషాద్రితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. తన బ్యాచ్లో అజయ్ అరోరా అనే అంధ ఐఏఎస్ ఉన్నారని గుర్తు చేసుకున్నారు. అనంతరం బ్రెయిలీ క్యాలెండర్ ఆవిష్కరించి కేక్కట్ చేశారు. అనంతరం అంధులను శాలువాలతో సత్కరించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 25వ తేదీన 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని అన్ని శాఖలు ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు దినోత్సవంలో ఓటు లాంటిది ఇంకొకటి లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాననే నినాదంతో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పర్చడం జరుగుతుందని తెలిపారు. పోస్టర్లు, బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సీసీసీ నస్పూర్, జనవరి 10: ఆర్థికంగా అభివృద్ధి చెందేలా నిరుద్యోగ యువతను ప్రోత్సహిండంతో పాటు జిల్లా పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువత, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర్రావు, శాఖ మేనేజర్ ఒమర్ ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు.