హాజీపూర్, నవంబర్ 30 : జిల్లాలో మాతాశిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఎంహెచ్వో సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారు లు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణలు ప్రసవం అయ్యే వరకు పీహెచ్సీలు, సర్కారు దవాఖానల్లో పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. అంతేగాకుండా ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్లను కూడా అందిస్తున్నామన్నారు.
శర ణ్య అనే గర్భిణి డెంగీ కారణంగా ప్రసవం అ యిన తర్వాత మరణించడం బాధాకరమరి, ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుం డా వైద్యాధికారులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ పూర్తి స్థాయి చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్. హరిశ్చంద్రారెడ్డి, ప్రోగ్రాం అధికారులు డా. నీరజ, అనిత, విజయపూర్ణిమా, అనీస్, వైద్యాధికారి ఝన్సీరాణి, మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, ఆరో గ్య, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు నష్టం జరిగితే ఊరుకోం
లక్షెట్టిపేట, నవంబర్ 30 : రైతులకు నష్టం జరిగితే సహించేది లేదని కలెక్టర్ భారతీ హోళికేరి హెచ్చరించారు. మండలంలోని కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్ మిల్లులను బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సెంటర్ల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు ఇ బ్బంది పెడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, డీసీఎస్వో ప్రేమ్ కుమార్ ఉన్నారు.