మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
జైపూర్, జూన్ 5: కొనుగోలు కేంద్రా ల్లో ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో మి ల్లులకు తరలించాలని అధికారులను జి ల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం తనిఖీ చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటు న్న నేపథ్యంలో వరిధాన్యం నిల్వలను రెండు రోజుల్లో రైస్మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు.
ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ట్యాబ్లలో నమోదు చేయాలని తెలిపా రు. తద్వారా రైతులకు చెల్లింపులు జరుగుతాయని సూచించారు. రైస్మిల్లులకు వచ్చిన లారీల నుంచి ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకొని వెంటనే తిప్పి పంపించేయాలన్నారు. హమలీల కొరత లేకుం డా అవసరం మేరకు ఏర్పాటు చేసుకొ ని అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చే యాలని సూచించారు.