మంచిర్యాల : టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని టీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ అన్నారు. మంచిర్యాల పట్టణంలో 28వ వార్డులోని గుత్తికొండ రవీందర్, 23వ వార్డులోని రామిల్ల సురేష్ ప్రమాదవశాత్తు మరణించారు.
వారికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో పార్టీ ఇన్సురెన్స్ ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందన్నారు. మిగతా ఏ పార్టీలో లేని విధంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు.