దండేపల్లి /లక్షెట్టిపేట రూరల్ : తెలంగాణ సర్కారు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని మాకుల పేటలో స్థానిక నాయకులతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, సర్పంచ్ అత్తె రాజవ్వ, ఎంపీటీసీ అమృతాబాయి, ఉప సర్పంచ్ పర్శినేని రాజగోపాల్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ మోటపల్కుల గురువయ్య, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేణి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, సహకార సంఘం అధ్యక్షుడు కాసనగొట్టు లింగన్న, బెడద సురేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేటలోని పెద్దయ్య దేవుని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఫారెస్టు అధికారులు వంటలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంలేదని, దేవాలయ పరిసరాలు తాము శుభ్రంగా ఉండేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పూజారులు, నాయకపోడ్ సంఘం నాయకులు మేకల పోశయ్య, చంద్రయ్య, ప్రశాంత్, తట్ర చిన్నయ్య, అర్జున్, చేదం ధర్మయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.