Sri Rama Navami | తాండూర్, మార్చి 27 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి, ఉత్సాహాలతో అంగరంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పల్లలకి సేవతో ప్రారంభమైన శోభాయాత్రలు పట్టణమంతా సందడి నింపాయి.
ఆలయ కమిటీ నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు సంయుక్తంగా ఈ శోభాయాత్రలను నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర ముగియడం పట్ల ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

Tandur Shobhayatra1

Tandur Shobhayatra1