మంచిర్యాల : నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎల్లారం చర్లపల్లి గ్రామ శివారు నుంచి ఇద్దరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మధుసూదన్ సిబ్బందితో కలిసి ఎల్లారం చర్లపల్లి గ్రామ శివారులో తనిఖీలో చేపట్టారు.
బైక్పై వెళ్తున్న వ్యక్తులను తనిఖీ చేయగా 10 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. అనంతరం వారిని విచారించగా రావి శ్రీను, తిరుపతి అనే వ్యక్తుల వద్దద కొనుగోలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.