మంచిర్యాల ఏసీసీ, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్, ఆర్యవైశ్య, వాస వి ఆర్యవైశ్య యువజన సంఘం, ఆవోపా ఆధ్వర్యంలో పట్టణంలోని వాటర్ ట్యాంక్ చౌరస్తాలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంత రం వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని కొనియాడారు. కార్య క్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్లు దొంతల ముఖేశ్, సిరిపురం శ్రీనివాస్, వీకేఎస్పీ జిల్లా ఇన్చార్జి అప్పాల శ్రీధర్, రీజియన్ చైర్మన్ పుల్లూరి బాలమోహన్, వుత్తూరి రమేశ్, కాచం సతీశ్, కేశెట్టి వంశీకృష్ణ, చిలువేరు శ్రీనివాస్, కొత్త రాజేశం, యువజన సంఘం అధ్యక్షుడు తంగడపల్లి సత్యవర్దన్, నేరెళ్ల శ్రీనివాస్, తనుకు శ్రీనివాస్, పల్లెర్ల శ్రీహరి, పండకంటి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు