శ్రీరాంపూర్, జూలై 14: భారీ వర్షాల కారణంగా శ్రీరాంపూ ర్ ఓసీపీలో ఏడో రోజూ గురువారం ఉత్పత్తి నిలిచిపోయింది. యంత్రాలు, డంపర్లు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. దీంతో రోజుకు 10 వేల టన్నుల చొప్పున 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి పాటు రోజుకు 60 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం కల్గింది. ఓబీ కాంట్రాక్టర్కు రోజుకు రూ.60 లక్షల నష్టంతో పాటు సంస్థకు రోజుకు రూ. 2 కోట్ల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లింది. కార్మికులు ఓసీపీపై మెయింట నెన్స్ పనులు నిర్వహిస్తున్నారు. క్వారీ జలమయం కాగా, కార్మికులు అక్కడికి వెళ్లే పరిస్థితులు లేకపోయాయి. ప్రస్తుతం ఓసీపీ ఉపరితలంలో నిల్వ ఉన్న బొగ్గును జైపూర్ ఎస్టీపీపీకి ర వాణా చేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా 20 ఓసీపీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రోజుకు 1.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతున్నది. సింగరేణి వ్యా ప్తంగా 7 రోజుల్లో 10.6 లక్షల టన్నుల ఉత్పత్తికి ఆటంకం కలిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మందమర్రి ఏరియా పరిధిలో..
రామకృష్ణాపూర్, జూలై 14: రామకృష్ణాపూర్ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని గని మేనేజర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, పీవో మధుసూదన్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఓసీలో నీరు నిలిచిందని, పంపుల ద్వారా తోడుతున్నట్లు తెలిపారు. రోజుకు 5 వేల మెట్రిక్ టన్నుల చొ ప్పున సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓబీ పనులు రోజుకు 55 వేల క్యూబిక్ మీటర్ల చొ ప్పున 4.40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీసే పనులకు ఆటంకం ఏర్పడింది.
ఆర్జీ 1 ఏరియా పరిధిలో..
గోదావరిఖని, జూలై 14: ఆర్జీ-1లో భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నది. జీడీకే-5 కొత్త ఓసీపీలో కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ప్రారంభించగా, వారం రోజులుగా 56 వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం కలిగింది. భారీ వర్షాలతో క్వారీలోకి వరద చేరడంతో పనులు స్తంభించాయి. దీంతో ఉ త్పత్తి సాధ్యం కాలేదు. అలాగే ఓబీ తొలగింపు పనులు కూడా నిలిచిపోయాయి. అలాగే భూగర్భ గనుల్లో కూడా హాజరు శా తం తగ్గుముఖం పట్టింది. వర్షాల ప్రభావంతో రోడ్లపై వరద ఉ ప్పొంగి ప్రవహిస్తుండడంతో పెద్ద సంఖ్యలో కార్మికులకు వి ధులకు వెళ్లలేకపోయారు. దీంతో భూగర్భ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి తగ్గుముఖం పట్టినట్లు భావిస్తున్నారు. వర్షాలతో గోదావ రికి వరద ఉధృతంగా వస్తుండడంతో జీడీకే-1వ గనిలో బు ధవారం జీఎం కే.నారా యణ లే ఆఫ్ ప్రకటించారు. దీంతో ఆ గని కార్మికులకు సగం వేతనం చెల్లిస్తున్నారు.
జీఎంలతో డైరెక్టర్ సమీక్ష
సింగరేణి రామగుండం రీజియన్ జీఎంలతో సంస్థ డైరెక్టర్ బలరాం సమావేశమయ్యారు. స్థానిక బంగ్లాస్ ఏరియాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి వరద, భారీ వర్షాలతో భూగర్భ, ఓసీపీ గనుల్లో బొగ్గుత్పత్తి ని లిచిపోయిందని, రెస్క్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరిఖని ఇంటెక్వెల్లో చిక్కుకున్న కార్మికుల ను సురక్షితంగా బయటకు తీసుకవచ్చిన తీరును అడిగి తెలు సుకున్నారు. జీఎంలు టీవీ రావు, మనోహర్, సేఫ్టీ జీఎం గురు వయ్య, రెస్క్యూ జీఎం వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
ఏఎల్పీ సందర్శన..
ఏపీఏ ఏరియా పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును డైరెక్టర్ ఎన్.బలరాం పరిశీలించారు. బొక్కలవాగు వరద కారణంగా ఏఎల్పీ గనికి రాకపోకలు నిలి చిపోవడంతో, సమాచారం తెలుసుకున్న ఆయన గురువారం సందర్శించి, పరిస్థితిని పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జి, పాన్ హౌస్, సబ్స్టేషన్లను పరిశీలించి, విపత్కర పరిస్థితుల్లో అందరూ అ ప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఓసీపీ-1,2 గ ను ల పరిస్థితిని ఆర్జీ-3 జీఎం మనోహర్ వివరించారు. సేఫ్టీ జీఎం గురువయ్య, వెంకటేశ్వరరావు, రెస్క్యూ జీఎం వెంకటేశ్వర్లు, ఏ పీఏ జీఎం ఎన్వీకే శ్రీనివాస్, ఆర్జీ-2 జీఎం టీవీ రావు ఉన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో..
బెల్లంపల్లి ఏరియాలోని గనుల్లో ఎడతె రిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. గురువారం ఫస్ట్షిప్ట్లో 2884 టన్నుల బొగ్గు ఉత్ప త్తి లక్ష్యానికి గానూ, ఎలాంటి ఉత్పత్తి జరగలేదు. దీంతో సుమారు రూ. 86.50 లక్షల నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. బుధవారం 8654 టన్నుల బొగ్గు ఉత్ప త్తి లక్ష్యానికి గానూ 6 శాతంతో 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు తెలిపారు.
భూపాలపల్లి ఏరియాలో..
భూపాలపల్లి ఏరియాలో కుండ పోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏడో రోజూ గురువారం ఓసీపీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఏరియాలోని కేటీకే ఓసీపీ-2, కేటీకే ఓసీపీ-3వ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి తవ్వకాలు పూర్తిగా నిలిచి పోయాయి. గురువారం వరకు కేటీకే ఓసీపీ-2వ గనిలో 23,100 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగ గా, 4.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు నిలి చిపోయాయి. ఓసీపీ-2వ గనిలో పడిన వర్షం నీరు జగ్గుల ద్వా రా భూ అంతర్భాగంలోకి వెళ్తున్నాయి. గని పరిసరాల్లో వర్షం నీటిని సబ్మెర్సిబుల్ పంపు సెట్ల ద్వారా బయటకు పంపిస్తు న్నారు. అదే విధంగా కేటీకే ఓసీపీ-3వ గని క్వారీలోకి వర్షం నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతూనే ఉంది. గురువారం వరకు 11 కోట్ల గ్యాలన్ల వర్షం నీరు వచ్చి చేరిందని, గనిలో ఏడు రోజులకు 14 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, 4.20 లక్షల క్యూ బిక్ మీటర్ల మట్టి తొలగింపు(ఓబీ) పనులకు ఆటంకం ఏర్ప డిందని తెపారు. గుడ్లవాగు ప్రవాహం మూలంగా కేటీకే ఓసీ పీ-3 గనికి రాకపోకలు రెండు రోజులుగా నిలిచిపోయాయని సింగరేణి అధికారులు తెలిపారు. పనుల్లేక యంత్రాలు ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి.