దహెగాం, జూలై 14: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రం సమీపంలోని మ ల్లన్న ఒర్రె వద్ద బుధవారం గల్లంతైన సింగరేణి రె స్క్యూ టీం సభ్యులు చెలుక సతీశ్, అంబాల రా ములు మృతదేహాలు గురువారం ఉదయం లభిం చాయి. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన ఓ గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుండగా, వరదల కారణంగా ఆమె వెళ్లలేని పరిస్థితి నెలకొం ది. దీంతో ఆమెను దవాఖానకు తరలించేందుకు మందమర్రికి చెందిన సింగరేణి రెస్క్యూ బృందా న్ని రప్పించారు. ఈ బృందంలోని ఐదుగురితో పాటు కాగజ్నగర్ రూరల్ సీఐ, మర్రిపల్లి గ్రా మా నికి చెందిన మరో ముగ్గురు తాడు సాయంతో బీబ్రా గ్రామానికి బయలు దేరారు. దహెగాం శి వారులోని మల్లన్న ఒర్రె సమీపంలో రెస్క్యూ టీ మ్ సభ్యులు చిలుక సతీశ్, అంబాల రాములు గల్లంతయ్యారు. అప్పటికే చీకటి పడడంతో గా లింపు చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదుర య్యాయి. గురువారం ఉదయం సింగరేణి నుంచి వచ్చిన మరో రెస్క్యూ టీం సభ్యులు గాలింపు చ ర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఆర్డీవో దత్తు, తహసీల్దార్ రామ్మోహన్రావు సమక్షంలో పంచనామా నిర్వహించి రెండు అంబులెన్స్ల్లో మంచిర్యాల దవాఖానకు తరలించారు.
ప్రాణాలు కాపాడేందుకు వచ్చిన వ్యక్తులు విగత జీవులుగా మారడంతో ఘటనా స్థలంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కంటతడి పెట్టడంతో, మిగతా వారు భావోద్వేగా నికి లోనయ్యారు.
స్వగ్రామంలో కన్నీటిసంద్రం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో సహాయ చర్యలకు వెళ్లి మృతి చెందిన చెలుక సతీశ్ స్వగ్రామం ఓదెల మండలంలోని ఇందుర్తిలో విషాదచాయలు అలు ముకున్నాయి. ఆపదలో ఉన్న వారిని రక్షించబో యి సతీశ్ మృతి చెందడం పలువురు గ్రామస్తుల ను కంటతడి పెట్టించింది. సతీశ్ తండ్రి రాజయ్య కూడా సింగరేణిలో ఉద్యోగం చేస్తూ మృతి చెందా డు. తల్లి సమ్మక్క, భార్య మమత, కూతురు క్రితి న్స్వీ (8), కుమారుడు రిషిక్ (2)ఉన్నారు.
కార్మికుల ధర్నా
మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన ఎదుట మృతదేహాలతో గురు వారం కార్మికులు, యూనియన్ నాయకులు ధ ర్నా నిర్వహించారు. రూ. 2 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకు న్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప, మంచి ర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్, శ్రీ రాంపూర్ జీఎం సంజీవ రెడ్డి, అదనపు కలెక్టర్ మ ధుసూదన్ నాయక్, గుర్తింపు సంఘం నేతలు చే రుకొని వారితో మాట్లాడారు. పరిహారంతోపాటు ఒకరికి ఉద్యోగం, నియోజకవర్గం నుంచి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పిస్తానని ఎమ్మెల్యే కోనప్ప హామీ ఇవ్వడంతో పాటు విషయాన్ని ముఖ్యమం త్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్మిక సంఘాల నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏనుగు రవీం దర్ రెడ్డి, వాసిరెడ్డి సీతారామ య్య, శంకర్ రావు, సీపీఐ నాయకులు కలవేన శంకర్, మేకల దాసు, పూదరి ప్రభాకర్, ఖలేందర్ ఖాన్, వీరభద్రయ్య పాల్గొన్నారు. కాగా కార్మికుల మృతితో శ్రీరాంపూ ర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.