భీంపూర్/ఎదులాపురం, డిసెంబర్ 25 : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని హస్నాపూర్ వద్ద ఆదివారం సాయం త్రం 6.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సృజిత్(40), మనీషా(15), సం స్కార్(11), నారాయణ(30) మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అశోక్నగర్కు చెందిన సృజిత్, ఆయన భార్య వందన, కూతురు మనీషా(15), కొడుకు సంస్కార్(11)తో కలిసి ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని కిన్వట్కు సృజిత్ తమ్ముడి ఎంగేజ్మెంట్కు వెళ్లారు. సా యంత్రం బైక్పై తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో వీ రు ప్రయాణిస్తున్న బైక్ను హస్నాపూర్ వద్ద ఆదిలాబాద్ నుం చి వస్తున్న మోటర్ సైకిల్ వేగంగా ఢీకొంది. ఈ మోటార్ సైకిల్పై నారాయణ ఉన్నాడు. ఈ ప్రమాదంలో సృజన్, మనీషా, నారాయణ అక్కడికక్కడే మృతిచెందగా.. వందన, సంస్కార్కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని రిమ్స్కు తరలించగా.. పరిస్థితి విషమించి సంస్కార్ కూడా మృతిచెందాడు. వందన పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.