Father | మంచిర్యాల జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురు మాట వినడం లేదని ఓ తండ్రి ఆ చిన్నారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చితకబాదాడు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల వయస్సున్న కూతురు తన మాట వినడం లేదని తండ్రి సతీష్ ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదుతుండగా.. అక్కడే ఉన్న ఓ పశుశుల కాపరికి ఆ చిన్నారి కేకలు వినిపించారు. దీంతో ఆ కాపరి ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు.
పశువుల కాపరిని చూసిన తండ్రి సతీశ్ చిన్నారిని తీసుకొని బైక్పై పరారయ్యాడు. చిన్నారిని విచక్షణా రహితంగా కొట్టిన సతీష్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి పట్ల తండ్రి సతీశ్ అలా కర్కశంగా వ్యవహరించడానికి గల కారణమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లాలో అమానుష ఘటన
మందమర్రిలో 6 సంవత్సరాల కూతురు తన మాట వినడం లేదని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదిన తండ్రి సతీష్
చిన్నారి కేకలు విని వీడియో తీసిన పశువుల కాపరి
పశువుల కాపరిని చూసి చిన్నారిని తీసుకొని బైక్ పై పరారైన తండ్రి సతీష్
చిన్నారిని విచక్షణ రహితంగా… pic.twitter.com/3nngKd4F3z
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2026