గోదావరిఖని, డిసెంబర్ 12: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎండీ శ్రీధర్ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కో రారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సీఎండీని సోమవారం కలిశారు. గోదావరిఖనిలో పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జవహర్ నగర్ వరకు, పరశురాం నగర్ మీదుగా డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఉన్న రోడ్డు, తిలక్నగర్ నుంచి అభినవ్ జ్యోతి స్కూల్ వరకు, ధర్మశాస్త్ర ఆశ్రమం వద్ద ఖాళీ స్థలంలో పార్కు అభివృద్ధి చేయాలన్నారు. చౌరస్తా వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. రమేశ్ నగర్ సెంటర్ నుంచి విఠల్నగర్ పోస్టాఫీసు వ రకు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం, ఎల్బీ నగర్ నుంచి రమేశ్ నగర్ వరకు సెంట్రల్ లైటింగ్, క్యాంపు కార్యాలయం నుంచి జీఎం కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నా రు.
సెక్టార్-2 కమ్యూనిటీ హాలు సమీపంలోని ఖాళీ స్థలాన్ని రామగుండం మున్సిపాలిటీకి అప్పగించాలనీ, నవోదయ స్కూ ల్ ఖాళీ స్థలం వద్ద 32వ డివిజన్లో సీనియర్ సిటిజన్ హాలు నిర్మాణం, తిలక్నగర్ డౌన్ నుంచి అభినవ్ స్కూల్, గ్లోబల్ కో ల్ మీదుగా రోడ్డు నిర్మాణం వాషర్లు, ఆదర్శ పాఠశాల నుంచి విఠల్నగర్ పోస్టాఫీసు ఏర్పాటు చేయాలన్నారు. ముస్లింలకు 4 ఇైంక్లెన్ కబరస్తాన్ 11.25 భూమిని కేటాయించాలన్నారు. జనగామలో 3 ఎకరాల భూమిని క్రిస్టియన్ శ్మశాన వాటిక కో సం కేటాయించాలని కోరారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలా ల్లో పార్కుల నిర్మాణం చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నా రు. యైటింక్లయిన్ వద్ద శ్మశాన వాటిక నిర్మాణం, తదితర స మస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎండీ సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపా రు. అలాగే ఓసీపీ-4 లింగాపూర్, మేడిపల్లి భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలనీ, బ్లాస్టింగ్లతో నష్టపోయిన ఇళ్లకు పరిహారం చెల్లించాలని కోరారు.