మంచిర్యాల : జిల్లాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్న పార్టీకి, మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, సిద్ధాంతాలు నచ్చక పార్టీ వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
పార్టీలో సరైన నాయకత్వం లేదని ఆవెదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్ష పదవికి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రకటనలో వెల్లడించారు.