మంచిర్యాల : మంచిర్యాల పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద గల కల్వర్టు నంబర్ 156 ని ఉపయోగించుకునేలా రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వాలని రైల్వే అధికారులను పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత కోరారు. ఈ కల్వర్టు వినియోగంలోకి వస్తే రాజీవ్ నగర్ ప్రజలకు దూరభారం తగ్గుతుందన్నారు.
ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని త్వరగా పరిష్కారం చూపాలన్నారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో అడిషనల్ జనరల్ మేనేజర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట మంచిర్యాల ఎమ్మెత్యే నడిపల్లి దివాకర్ రావు ఉన్నారు.