దండేపల్లి : తెలంగాణ గడ్డ మతసామరస్యానికి ప్రతీక. వందేల ఏండ్లుగా సబ్బండ వర్ణాలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో అయ్యప్ప స్వాములకు నిజాం గ్యారేజ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ నిజాముద్దీన్ అల్పాహారం ఏర్పాటు చేసి మరోమారు తెలంగాణలోని మత సామరస్యాన్ని చాటాడు.
అయ్యప్ప స్వాములకు నిజాం స్వయంగా దగ్గరుండి అల్పాహారం వడ్డించాడు. హిందూ-ముస్లిం భాయి భాయి అనే పదానికి ప్రతీకగా నిలిచినా నిజాం పలువురికి ఆదర్శప్రాయుడని గ్రామస్తులు అభినందించారు. కుల,మతాలను పక్కనపెట్టి పాత్రికేయుడు నిజాం తమకు అల్పాహారం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అయ్యప్ప స్వాములు అత్తె సత్తయ్య స్వామి, మంత్రి దేవయ్య స్వాములు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక ముస్లిం కమిటీ సదర్ దావూద్ ఖాన్, నాయబ్ సదర్ ఇమ్రాన్ ఖాన్, ముస్లిం యువకులు నజీర్, సాదిక్, సద్దాం, రహీం, షబ్బీర్, జాఫర్, తాజ్ బాబా, సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.