ఇచ్చోడ, మార్చి 1 : మహాశివరాత్రి పర్వదినా న్ని మంగళవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టా రు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగా యి. మండలంలోని సిరిచెల్మ మల్లికార్జునాల యం, ఇచ్చోడలోని శివాలయంలో భక్తులు ప్రత్యే క పూజలు చేశారు. సిరిచెల్మ మల్లన్న ఆలయం చెరువులో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సిరిచెల్మలోని మల్లికార్జునాలయం వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్ఐ ఉదయ్కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ రూరల్, మార్చి 1 : పట్టణంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. పట్టణంలోని గంగపుత్ర శివాలయం, రాంనగర్లోని రాజరాజేశ్వరాలయం, రవీంద్రనగర్లోని ఉమా మహేశ్వర ఆలయం, అంకోలి రోడ్లోని శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచే శివుని దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేశారు. శివపార్వతులను దర్శించుకున్నారు. ఆలయాల్లో హారతులు, రుధ్రాభిషేకాలు, హోమాలు, యజ్ఞాది కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాగాయి. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివలింగాల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఎమ్మెల్యే జోగు రామన్న పలు శివాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని న్యూహౌసింగ్బోర్డులో మహాకాల్ సేన ఆధ్వర్యంలో చేపట్టిన శివపార్వతుల శోభాయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. యువకులు నృత్యాలు చేయగా.. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు జాదవ్ పవన్నాయక్, అజయ్, తిరుమలేశ్, శివకుమార్ పాల్గొన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలు ప్రత్యేక వేషధారణ తో డోలువాయిస్తూ పట్టణ ప్రధాన వీధుల్లో నృత్యం చేయడం ఆకట్టుకున్నది.
జైనథ్, మార్చి 1: మండలంలోని కొరాట సమీపంలోని పెన్గంగ ఒడ్డున ఉన్న అతి పురాతన శివాలయంలో టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి దర్శించుకున్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్రెడ్డి, సర్పంచ్ మహేశ్, నాయకులు గోక భూమారెడ్డి ఉన్నారు. మండలవాసులు శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భోరజ్, కోర్టలోని శివాలయం, కంఠలోని కోటిలింగాల, లక్ష్మీపూర్లోని మార్కండేయ మందిరం, పెండల్వాడలోని ఆత్మలింగ ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయాల్లో రాత్రి జాగరణ, భజన కార్యక్రమాలు చేశారు. బుధవారం ఉపవాసాన్ని విరమించి అన్నదానంలో పాల్గొననున్నారు.
బేల, మార్చి 1 : మండలంలోని బాది గ్రామ అతి పురాతన నందీశ్వర ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజాలు చేపట్టనున్నారు. జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. బాదిలో మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీష ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
బోథ్, మార్చి 1: మండలంలో మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోథ్లోని శివ భక్త మార్కండేయ ఆలయం, విఠలేశ్వర ఆలయంలో పాటు సొనాల, కౌఠ (బీ), ధన్నూర్ (బీ), కుచ్లాపూర్, పొచ్చెర, మర్లపెల్లి తదితర గ్రామాల్లోని హనుమాన్ మందిరాల్లో శివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బోథ్ సమీపంలోని పెద్దార్లగుట్ట ఆలయంలో వేద పండితుడు సంతోష్శర్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నిగిని అటవీ ప్రాంతంలోని కైలాస్ శిఖర గుట్టపై కొలువై ఉన్న నర్మదేశ్వరుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కుచ్లాపూర్ సమీపంలోని చిన్నవాగు తీర్థానికి భక్తులు పోటెత్తారు. బోథ్లోని విఠలేశ్వర ఆలయంలో వేద పండితుడు సదానందశర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణోత్సవం చేయించారు. మొదట ఉత్సవ మూర్తులను ఊరేగించారు.
తాంసి, మార్చి 1 : మండలంలో ఉదయం నుంచి శైవాలయాలు భక్తులతో కళకళలాడాయి. ఆలయాల్లో శివుడికి అభిషేకాలు, తాంసిలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. వడ్డాడి, బండల నాగాపూర్, జామిడి, గిరిగాం, పొన్నారి, కప్పర్లలో యజ్ఞం చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కనులపండుగా సాగింది. ఎంపీపీ మంజులా శ్రీధర్రెడ్డి, సర్పంచులు కృష్ణ, శ్రీనివాస్, వెంకన్న, సంజీవ్రెడ్డి, గజానన్, సదానందం, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, మార్చి 1: మండలంలో మహాశివ రాత్రిని ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని శివాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
నేరడిగొండ, మార్చి 1 : మండలంలోని కుంటాల జలపాతం వద్ద ఉన్న సోమేశ్వరుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దర్శనం కోసం తెల్లవారు జామునుంచే భక్తులు దర్శనానికి తరలివచ్చారు. గుహలో ఉన్న సోమేశ్వరున్ని దర్శించుకోవడానికి ఇనుప నిచ్చెన వద్ద భక్తులు బారులు తీరారు. ఎస్ఐ మహేందర్ ఆలయ ప్రదేశంలో భద్రత ఏర్పాట్లు చేశారు.
భీంపూర్, మార్చి 1: మండలంలోని అన్ని గ్రామాల్లో ఆలయాలు కిటకిటలాడాయి. పంచాక్షరీ ధ్వనులతో గ్రామాలు మార్మోగాయి. కరంజి(టీ) రామాలయం, గుబ్డి, గొల్లగడ్ శివాలయాలు, నిపాని, పిప్పల్కోటి, అర్లి(టి) వేంకటేశ్వరాలయాల్లో విశేష పూజలు చేశారు. రాత్రి భజన కీర్తనలతో జాగరణ చేశారు. హనుమాన్ మందిరాల్లో శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. మండలవాసులు సమీప మహారాష్ట్ర శైవక్షేత్రమైన ఉన్కేశ్వర్, రాంగనర్ వెళ్లి దర్శనాలు చేసుకున్నారు. మండలంలోని అంతర్గాం గ్రామంలో రాత్రి నుంచి భజనకీర్తనలు ప్రారంభించారు. బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి.
సిరికొండ, మార్చి 1 : మండలకేంద్రంతో పాటు కొండాపూర్, రాయిగూడ, సుంకిడి తదితర గ్రామాల్లోని శివాలయంలో భక్తులు ఉదయం శివ పార్వతుల ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తి పాటలతో శివపార్వతుల విగ్రహాలను ఊరేగించారు. మహిళలు, యువకులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఉట్నూర్/ ఉట్నూర్ రూరల్, మార్చి 1: మండలంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాస దీక్షలు స్వీకరించారు. ఉట్నూర్ లో పంతులు సంతోష్ బుబే, సాలేవాడలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్ దంపతులు, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఇంద్రవెల్లి పీఏసీఎస్ చైర్మన్ మారుతి డోంగ్రే పూజలు చేశా రు. భక్తుల తాకిడితో ఆలయాలు కిటకిటలాడా యి. హర్కపూర్ గ్రామ పమీపంలో నాగేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీటీసీ రవీందర్, రాజు, భక్తులు పాల్గొన్నారు.
నార్నూర్,మార్చి1: మండలంలోని చోర్గావ్ మూర్తి రాములు శివాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పీఠాధిపతి మూర్తి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. చైర్మన్ను శాలువాతో సన్మానించారు. ఆలయ ప్రాంగణంలో జెండా ఎగురవేశారు. సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. అన్నదానం నిర్వహించారు. డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, జీవ వైవిద్య జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, గ్రామ పెద్దలున్నారు.
బజార్హత్నూర్, మార్చి 1 : మండలంలోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. మండలంలోని పిప్పిరి, గిర్నూర్, బజార్హత్నూర్, జాతర్ల తదితర గ్రామల్లోని శివాలయాల్లో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. మండలకేంద్రంలోని మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో పల్లకీ శోభాయాత్ర చేపట్టారు. రాత్రి వేళలో శివపార్వతుల కల్యాణ మహోత్సవంతో జాగరణ కార్యక్రమం ఉంటుందని ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.
తలమడుగు, మార్చి 1 : మండలంలోని ఝరి పురాతన రాజరాజేశ్వరాలయంలో డీఎస్పీ వెంకటేశర్లు, సీఐ పురుషోత్తం, ఎస్ఐ ప్రవళిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుయ్యాడిలోని శివాలయంలో జడ్పీటీసీ గణేశ్రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా 200 మంది వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. తలమడుగు, కజ్జర్ల, కుచులాపూర్, చెర్లపల్లి తదితర గ్రామాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.