మంచిర్యాల ప్రతినిధి/కాగజ్నగర్, ఏప్రిల్ 26 : కాగజ్నగర్ డివిజన్లోని వైన్స్ల నిర్వాహకులు సిండికేట్గా మారి మద్యం ధరలు పెంచేసి విక్రయిస్తున్నా, ఎక్సైజ్శాఖ అధికారులు ‘మాములు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. బీర్పై ఎంఆర్పీ కంటే ఎక్కువగా రూ.20, ఫుల్ బాటిల్పై రూ.180 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నా పట్టించుకోవడం లేదు. చింతలమానేపల్లి మండలం మహారాష్ట్ర బార్డర్కు సమీపంలోనున్న గూడెంలోని ఓ వైన్స్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండడంపై మందుబాబుల నిలదీయగా, ఆ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే వైన్స్పై స్థానిక యువకులు కాగజ్నగర్ ఎక్సైజ్ సీఐకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
ఆ సమయంలో వైన్స్షాప్ నిర్వాహకులు రెచ్చిపోవడం గమనార్హం. ‘ఎవ్వరికి ఎం త ఇవ్వాలో అంత ఇస్తున్నాం. ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. మా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతాం’ అని వారు బాహాటంగానే చెప్పారంటూ బాధితులు తెలిపారు. మహారా ష్ట్ర పక్కనే ఉన్న ఈ వైన్స్షాప్లో మద్యానికి డి మాండ్ ఎక్కువ. చాలా మంది ఆ రాష్ట్రం వా ళ్లు ఇక్కడికి వచ్చి మధ్యం కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. అందుకే అధిక ధరలకు అమ్మడం పరిపాటిగా మారిందని స్థానికులు అంటున్నారు. వైరలైన వీడియోపై షాపు యాజమానిని ఫోన్లో వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
వైన్స్షాపుల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్మడంతో పాటు బెల్ట్షాపులను ప్రోత్సహించడం ఎక్కువైపోయింది. కొన్ని వైన్ షాపుల్లో లభించని మద్యంబ్రాండ్లు బెల్ట్షాపుల్లో దొరుకుతున్నాయి. మద్యం ప్రియులు ఇదేమని అడిగితే.. ఉన్న స్టాక్ మొత్తం బెల్ట్ షాపుల నిర్వాహకులు తీసుకెళ్లారని. మేమేం చేయాలని.. చెప్పడం విస్మయానికి గురి చేస్తున్నది. కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ నామమాత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైన్స్ షాపులు, బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేయాల్సి వస్తే ముందస్తు సమాచారం ఇచ్చాకే.. అధికారులు అక్క డికి వెళ్తారని.. అంతా పకడ్బందీగా ఇల్లీగల్ వ్యాపారానికి సహకరిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగజ్నగర్ డివిజన్లోని కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం, కాగజ్నగర్ మండలాల్లో సిండికెట్ మద్యం వ్యవహారం కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక మద్యం వ్యాపారి కొన్ని మండలాలను కలిపి సిండికేట్ చేసి ఈ వైన్స్లు నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. సిండికేట్ కావడంతో ప్రతి మద్యం బాటిల్పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా దండుకుంటున్నారు. ఈ విషయమై గతంలో ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇటీవలే కాగజ్నగర్లో ఒక మద్యం దుకాణంలో కల్తీ మద్యం దొరికింది. ఎప్పుడైనా రాష్ట్ర స్థాయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి తనీఖీ చేసి కల్తీ మద్యం పట్టుకుంటే తప్ప…ఇక్కడి అధికారులతో అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వైన్స్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.