నిర్మల్ అర్బన్, మార్చి 22 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. మరో వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖలో అమలు చేస్తున్నది. పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేలా వీటిని ఏర్పాటు చేస్తున్నది. నిర్మల్ జిల్లాలో మన ఊరు-మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు డీఈవో రవీందర్ రెడ్డి చర్యలు చేపట్టారు. జిల్లాలో 260 పాఠశాలలు మన ఊరు-మన బడి కింద ఎంపికయ్యాయి. ఈ మేరకు తొలి విడుతలో 152 పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో విడుతలో మిగిలిన పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాకు చేరిన గ్రంథాలయ పుస్తకాలు
గ్రంథాలయాలు ఏర్పాటు చేసే ఒకో బడికి 259 పుస్తకాలను అందజేయనున్నారు. నిర్మల్ జిల్లాలోని 152 పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు పుస్తకాలు అందజేశారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరుకోనున్నాయి. ఈ పుస్తకాలను నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) 30 పుస్తకాల చొప్పున పీ, క్యూ, ఆర్, ఎస్ అనే నాలుగు రకాల పుస్తకాలను అందించనున్నారు. రూమ్ టూ రీడ్ సంస్థ వారు 120 చిన్న పుస్తకాలు, 19 పెద్ద పుస్తకాలను 152 పాఠశాలలకు అందించనున్నారు. విద్యార్థులు గ్రంథాలయ పుస్తకాలను చదువుకునేందుకు జిల్లా లోని 38 మోడల్ పాఠశాలలకు కార్పెట్లు వచ్చా యి. వీటిని భద్రపర్చేందుకు ర్యాక్లను త్వరలో పంపిణీ చేయనున్నారు.
గ్రంథాలయ పీరియడ్ నిర్వహణ..
విద్యా శాఖ ఇటీవలే తొలి మెట్టు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బడుల్లో గ్రంథాల యాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రంథాలయ పీరి యడ్ను నిర్వహిస్తారు. రోజుకు 15 నిమిషా లు పాటు చదివిస్తారు. ప్రతి టీచర్ తమ సబ్జెక్టు, సంబంధిత ఇతర పుస్తకాలను విద్యార్థులతో చదివించాలని విద్యాశాఖ అధికారులు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో కనీస సామ ర్థ్యాలను పెంచేలా కృషి చేస్తారు.
అన్ని అంశాల్లో పట్టు సాధించేందుకే..
సర్కారు పాఠశాల ల్లో గ్రంథాలయాలను నెల కొల్పడం మంచి ఆలోచన. విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుం ది. అన్ని అంశాల్లో పట్టు సాధిస్తారు. పుస్తక పరిజ్ఞానంతోపాటు గ్రంథాలయాల్లో పుస్తకాలను చదవడం వల్ల ఇతర అంశాలపై సంపూర్ణ అవగాహన వస్తుంది. పాఠ శాల స్థాయి నుంచే గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం మంచి అలవాటు. భవిష్యత్ చదువు లకు పునాది అవుతుంది.
– రవీందర్ రెడ్డి, డీఈవో(నిర్మల్)