ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనవారిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. గురువారం పట్టణంలోని బస్టాండ్ ఎదుట అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహనిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన విద్యార్థులు, ఉద్యమకారులకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకుందని గుర్తు చేశారు.
శ్రీకాంతాచారి విగ్రహనిర్మాణం చేపట్టాలని కోరిన వెంటనే ఎమ్మెల్యే జోగు రామన్న స్థలం పరిశీలించి భూమి పూజ చేయాలని సూచించారన్నారు. డిసెంబర్ 3లోపు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, పార్థసారథి, కట్ట కృష్ణ స్వామి, సత్యనారాయణ, వేణుగోపాల్, సత్యం, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.