తానూర్, డిసెంబర్, 13 : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సోమవారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన విసృతస్థాయి సమవేశంలో జిల్లా జాగృతి నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారడంతో సమవేశాన్ని నిర్వహించారు. భవిష్యత్లో జాగృతి చేపట్టనున్న కార్యక్రమాలను ఆమె నాయకులకు వివరించారు. సమవేశానికి జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణచారి, జిల్లా యూత్ అధ్యక్షుడు అట్టల్ దేవీదాస్, ముథో ల్ నియోజక వర్గ కన్వీనర్ పండిత్రావు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా నాయకులు
నిర్మల్ టౌన్, డిసెంబర్ 13: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను నిర్మల్కు చెందిన పలువురు జాగృతి నాయకులు మం గళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న సామాజిక సేవా కార్యక్రమాలు, బీఆర్ఎస్ ఆవశ్యకత తదితర అంశాలపై పలు సూచనలు చేసినట్లు జాగృతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసాచారి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దేవీదాస్, సాయికృష్ణ, పండిత్రావు తదితరులు పాల్గొన్నారు.